ఏపీలో మందుబాబులకు పండగలాంటి వార్త.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రకటించింది. 2021-22కి సంబంధించిన విధానంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2934 దుకాణాలు మద్యం విక్రయాలు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్సుల కాలపరిమితిని 2022 సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని గెజిట్ లో పేర్కొంది. రిటైల్ అవుట్ లెట్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. వాకింగ్-స్టోర్లు ఏర్పాటుకు బేవరేజెస్ కార్పొరేషన్ కు అనుమతులు ఇచ్చింది.

మద్యం విక్రయాలు, లావాదేవీల్లో పారదర్శకత కోసం ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయనున్నారు. మద్యం దుకాణాల్లో డ్యూయల్ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. అమ్మకాల పారదర్శకత కోసం అక్రమాలు, అక్రమాల నిరోధానికే డిజిటల్స్ చెల్లింపుల విధానం తెచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించారు. టూరిజం ఫెసిలిటీస్ కేంద్రాల్లో మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైవేల వెంట మద్యం అమ్మకాలపై సమీక్షిస్తామని ఇస్తామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరి వరకు మద్యం విక్రయాలను నిషేధించడం తో పాటు ఉ ఆ ప్రాంతంలో మద్యం దుకాణలు, పర్మిట్ రూమ్ లోనే అనుమతించలేదు. సాధారణ మద్యం షాపుల్లో రోజుకు సగటున రూ.2-2.50 లక్షల వరకు మద్యం ఆమ్ముడైతే, వాకిన్ స్టోర్ లో రూ.7-8 లక్షల మద్యం విక్రయిస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంది.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker