రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్ లో దిశ యాప్’ సీఎం జగన్ కీలక అదేశాలు

Cm jagan: లా అండ్ ఆర్డర్ పై తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. మహిళలు, చిన్నారులపై నేరాలు విచారణకు ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పోలీస్ బలగాల బలోపేతం, మాదకద్రవ్యాలను అరికట్టడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఏపీ లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఫోన్ లో disha app ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం వాలంటీర్లు మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలన్నారు. కాలేజ్, యూనివర్సిటీ లపై నా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మిషన్ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కోసం అందరూ పని చేయాలని చెప్పారు. సైబర్ క్రైమ్ నిరోధం పై ప్రత్యేక కార్యాచరణకు సీఎం జగన్ ఆదేశించారు.

ఇప్పటి వరకు 74,13,562 మంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేశారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. దిశా యాప్ ద్వారా 5238 మందికి సాయం అందించినట్లు వివరించారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల మ్యాపింగ్ చేసినట్లు చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్ లో అన్నిటిని కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందని వివరించారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్ కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు వివరించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని… ఫోరెన్సిక్ సదుపాయాలు ప్రభుత్వం పెంచడం వల్ల కేసులు దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. గతంలో DNA report కోసం ఏడాది పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు రెండు రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker