తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి



సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ ఆహ్వానం

అమరావతి: తిరుమలలో అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు హాజరుకావాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.

తాడేపల్లిలోని CM క్యాంపు కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు సీఎం శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి వాణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.