Sonu Sood: విజయవాడ పర్యటనకు వెళ్లిన సోనుసూద్, కలిసిన అమరావతి రైతులు

అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన సోను సూద్

 రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు గత 632 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ ఉద్యమానికి ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ మద్దతు ప్రకటిస్తూ ఇవ్వాళ విజయవాడ పర్యటన చేశారు. విజయవాడ పర్యటనకు వచ్చిన పోలీసు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.ఇదే సమయంలో అమరావతి రైతులు ఆయనను కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ రైతుల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు  విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు.