AP Teacher News

ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం

ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం

గుంటూరు, విజయవాడ లో అక్టోబర్ 27వ తేదీ మరియు 28 తేదీలలో ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణం రాజు గారు తెలియజేశారు. ఆదివారం రోజున గుంటూరులో ఆయన సహచర నిర్వాహకులతో కలిసి ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. సామాజిక, సాంస్కృతిక, విజ్ఞాన, న్యాయపరమైన అంశాలపై ఆయా వేదికలపై చర్చిస్తారని కార్యక్రమానికి హాజరైన ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యులు సాంబశివరావు గారు చెప్పారు. మేధాపాట్కర్, సామాజికవేత్త రామన్ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్ పాండే, వి.వి లక్ష్మీనారాయణ సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జిఎస్ఎన్ రాజు తదితర మేధావులు ఈ ఉత్సవానికి హాజరవుతారని తెలిపారు.