AP Teacher News

AP ఉపాధ్యాయులకు నిష్టా శిక్షణ

AP ఉపాధ్యాయులకు నిష్టా శిక్షణ

ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు ప్రధానోపాధ్యాయులకు ఆరునెలల నిష్టా ఆన్లైన్ శిక్షణ ప్రారంభం అయిందని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. నిష్టా మూడో విడత కింద ఈ శిక్షణ ఇస్తున్నారు. మార్చి 31వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగనుందని తెలియజేశారు. ఒక 5 నుంచి 6 రోజుల వరకు ఉంటుంది. ప్రతినెలా 2 కోర్సుల ప్రకారం మొత్తం 12 కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా ఉపాధ్యాయులు దీక్ష యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ సహాయంతో బోధిస్తున్న మాధ్యమం, తరగతుల వివరాలు నమోదు చేసుకొని శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుందని జిల్లా సమగ్ర శిక్ష వారు తెలిపారు.