income tax

ITR ఈ-ఫైలింగ్ గడువు పెంపు, 2021కి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్

ఐటీఆర్ ఈఫైలింగ్ గడువు పెంపు

డిసెంబర్ 31,2021 వరకు చేసుకునే అవకాశం

ఆర్థిక సంవత్సరం 2020-2021కి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 30, 2021 నుంచి డిసెంబర్ 30, 2021 వరకు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఖాతాలు ఆడిట్ చేయాల్సిన అవసరంలేని, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫామ్స్ వర్తించే వ్యక్తిగత చెల్లింపుదార్ల గడువు వర్తిస్తుంది.

ఆదాయ పన్ను చట్టం కింద 2021-2022 అంచనా ఏడాదికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులు, ఆదాయ పన్ను దాఖలులో ఎదురవుతున్న ఇబ్బందులపై పన్ను చెల్లింపుదారులు, భాగస్వాముల నుంచి ఫిర్యాదులు అందిననేపథ్యంలో గడువును పొడిగించినట్టు ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా 2020-2021కి సంబంధించిన వ్యక్తిగత ఐటీఆర్ దాఖలు గడువు ఇప్పటికే జులై 31, 2021 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది. అయితే కొత్త ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి.

ప్రారంభం నుంచి ఇతర సమస్యలు కూడా వచ్చాయి. దీంతో పోర్టల్ తయారుచేసిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికే భేటీ కావడం జరిగింది. అన్ని సమస్యలను సరిదిద్దేందుకు సెప్టెంబర్ 15,2021 వరకు గడువు తీసుకున్నారు. ఆ తర్వాత పనితీరును బట్టి పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ దాఖలు గడువును ఆర్థిక శాఖ వారు పొడిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button