AP Teacher News

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 15న

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 15న

ఐఐటీల్లో ప్రవేశానికి గాను అక్టోబర్ 3న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ యొక్క ఫలితాలు అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న ఐఐటీ ఖరగ్పూర్ వారు ఫలితాల తేదీని వెల్లడించడం జరిగింది. జేఈఈ మెయిన్లో అర్హత పొందిన వారు అడ్వాన్స్ పరీక్ష రాయడానికి దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసిపోయింది.

అడ్మిట్ కార్డులను ఈ నెల 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు‌. అక్టోబర్ 3, 2021 న జరుగుతున్న పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని అక్టోబర్ 10వ తేదీన వెల్లడిస్తారు. ర్యాంకులను అక్టోబర్ 15న విడుదల చేయడం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెడతారని ఐఐటీ ఖరగ్పూర్ వారు తెలపడం జరిగింది.