Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

సిద్దేశ్వరం, సోమశిల ను కలుపుతూ ఐకానిక్ తీగల బ్రిడ్జి నిర్మాణం

భారతదేశంలోనే మొట్టమొదటి ఐకాన్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య నిర్మించబోతున్నారు. కృష్ణా నదిపై ₹1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీని పూర్తి చేయడానికి ఆమోద ముద్ర రోడ్డు రవాణా శాఖ వేసింది.

సిద్దేశ్వరం, సోమశిల ను కలుపుతూ ఐకానిక్ తీగల బ్రిడ్జి నిర్మాణం

హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విట్టర్ లో ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద ఇది నిర్మితం కానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే రెండోవది. దేశంలో మొదటిది అవుతుంది.

హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం 80కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ చెప్పారు. దీనికి తెలంగాణ వైపు లలిత సోమేశ్వర స్వామి ఆలయం ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉందని. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం నల్లమల్ల అడవులు ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని తెలియజేశారు.

సిద్దేశ్వరం, సోమశిల ను కలుపుతూ ఐకానిక్ తీగల బ్రిడ్జి నిర్మాణం

పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఈ వంతెన పై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్ వాక్ వే ఉంటుందని. గోపురం వంటి పైలాన్లు ఉంటాయని వివరించారు..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker