సీఆర్ టీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ

కర్నూల్: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీఆర్ టీ, పీజీటీ పోస్టులకు తాత్కాలిక పద్ధతిలో నియామకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని 53 కేజీబీవీ మొత్తం సిఆర్ టీ లు 62, పీజీటీలు 21 పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటిని ప్రభుత్వం జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన మహిళలు లెక్చరర్లు, ఉపాధ్యాయులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆయా మండల కేంద్రాల్లో గల కేజీబీవీలో గానీ, జిల్లా కేంద్రంలోనీ సమగ్ర శిక్ష కార్యాలయంలో గాని ఈ నెల 25,26,27, తేదీ తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.

సీఆర్ టీ లు తెలుగు- 4, హిందీ-3, ఉర్దూ-1,
ఇంగ్లీష్-8, గణితం-5, ఫిజిక్స్-9, బయోలాజికల్ సైన్స్ -10, సోషల్-9, అలాగే పీజీటీలు ఇంగ్లీష్-2,
ఫిజిక్స్-1, బోటనీ-3, కెమిస్ట్రీ-7, జీఎఫ్ సీ-6, సీఎస్ఈ-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఏపీసీ తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker