బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్-2021 ఈనెల 21వ తేదీ



AU క్యాంపస్ విశాఖ తూర్పు: రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్(2021 ప్రవేశ పరీక్ష) ను ఈనెల 21వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య కె విశ్వేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 69 కేంద్రాలలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష సమయానికి గంట ముందు నుంచి విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని తెలిపారు. పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలతో అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు పంపిస్తామని తెలిపారు. అభ్యర్థులు www.sche.ap.gov.in/edcet వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker