Site icon Education Telugu Thefinexpress

APPECET 2021: 24 నుంచి ఏపీ పీసెట్



ANU: రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీసెట్-2021 ప్రవేశ పరీక్షలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పి జాన్సన్ తెలిపారు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి 1,857 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు పురుష అభ్యర్థులకు, 27వ తేదీన మహిళా అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.