రేపు 700 మంది ఖైదీల విడుదల: స్టాలిన్



• తమిళనాడు రాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం..

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి C N అన్నాదురై జయంతి సందర్భంగా నెల 15 బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడు వందల మంది ఖైదీలను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర సీఎం M.K స్టాలిన్ సోమవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు.

పోలీస్ శాఖలో గ్రాంట్ల డిమాండ్ కు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ 700 మంది జీవిత ఖైదీల శిక్షను తగ్గించేందుకు, సత్ప్రవర్తన పరిగణలోకి తీసుకుని మానవతా కోణంలో వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తామని వెల్లడించారు. నీట్, ప్రభుత్వ మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం పెట్టిన కేసులు కూడా ఉపసంహరిస్తామని అన్నారు. CAA, రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై నమోదు అయినా 5,570 కేసులను వెనక్కి తీసుకుంటామన్నారు.