నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటించిన ప్రేమ కథ చిత్రం విడుదల ఎప్పుడంటే!!

నాగచైతన్య, సాయి పల్లవి ప్రేమకథ చిత్రం తెరపైకి రానుంది. వీరిద్దరూ జంటగా నటించిన’ లవ్ స్టోరీ’సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, అమిగోస్ క్రియేషన్ పతాకాలపై కె.నారాయణ దాస్ నారంగ్ పి.రామ్ మోహన్ రావు నిర్మించనున్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీ లాక్డౌన్ 2.0 తర్వాత తెలుగులో విడుదలైన మొదటి తెలుగు సినిమా అవుతుంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసుల కారణంగా దాని విడుదల ప్రణాళికలలో అనేక వాయిదాలను చూసిన తరువాత, ఈ చిత్రం సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

నాగ చైతన్య అక్కినేని బుధవారం కొత్త పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

నారాయణ దాస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రేవంత్( నాగ చైతన్య) మౌనిక (సాయి పల్లవి) ప్రేమ కథను తెరపై చూపించేందుకు చాలా రోజులుగా ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.

ఈ సినిమా పాటలు మంచి ఆదరణ పొందాయి. సారంగదరియా’… పాట యూట్యూబ్లో ఆల్ టైం రికార్డ్ లను తిరగరాసింది. శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజెంట్ ఎమోషనల్ ప్రేమ కథ ఈ పాటలు అదనపు ఆకర్షణ అన్నారు. విజయ్ సి. కుమార్,

సంగీతం: పవన్ సహనిర్మాత: భాస్కర్ కటకం శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు.