andhra pradeshysrcp

కేసిఆర్, చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలపై విరుచుకుడ్డారు. తొలిసారిగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తీరు మార్పు అంశంపై స్పందించారు. పేరు మార్చడంపై కొందరు నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారికి తాను ఒక విన్నపం చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ పేరు వాడుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఆయన రక్త మాంసాలతో రాజకీయాలు చేసిన వారిని తరిమి కొట్టడానికి దీక్షలు చేయాలన్నారు. తనది విన్నపం లేదంటే సూచన లేదంటే హెచ్చరిక ఎలా అనుకున్న పర్లేదు అన్నారు.

చంద్రబాబునాయుడు వెళ్లి తెలంగాణలో పోటీ చేయడం లేదా? అని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునేవారే ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నారని, కనీసం జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టలేకపోయారన్నారు. రాజకీయాల కోసం అన్న క్యాంటీన్లు పెడుతున్న వారిని ముందుగా తరిమికొట్టాలన్నారు. పవన్ కు మద్దతు ఇస్తున్న చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. అవసరం అనుకుంటే మద్దతిస్తానని చిరంజీవి అన్నారని, కానీ పవన్ కు ఆ అవసరం రాదని, ఆయన కన్నా చంద్రబాబు పెద్ద స్టార్ అని వ్యంగంగా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పవన్ వెనుక ఉన్నప్పుడు చిరంజీవి అవసరం ఉండకపోవచ్చు అన్నారు.

కెసిఆర్ ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఆయనకు ఏపీలో ఆదరణ ఉంటుందా? లేదా? అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, హైదరాబాద్ నుంచి తమను వెనక్కి పంపారని భావన ఉందన్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడి సెటిలర్లు టిఆర్ఎస్ కే ఓటు వేస్తున్నారు. ఆయన అభ్యర్థులు దొరుకుతారో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.

కొడాలి నాని పదేపదే టిడిపి నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుక పడుతుండడంతో ఈసారి ఎన్నికల్లో అతని ఓడించాలని పట్టుదలతో పార్టీ ఉంది. రావి వెంకటేశ్వరరావు ఇంచార్జిగా ఉంచారు. అయితే రావికి సీటు ఇస్తారా? చివరి నిమిషంలో మారుస్తారా? అనే దానిపై స్పష్టత రాలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే గుడివాడ నియోజకవర్గం జనసేనకు వదిలిపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button