BRS

తొలిసారి ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం కేసిఆర్

న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ఢిల్లీలో అడుగు పెట్టారు.బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు కేసీఆర్. ఈ వారంతం వరకు కూడా కెసిఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.

పలు పార్టీల నేతలను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది.బీఆర్ఎస్ ప్రకటన తర్వాత కెసిఆర్ తొలి ఢిల్లీ పర్యటన కావడంతో ఆయన ఏ పార్టీ నేతలతో భేటీ అవుతారని ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఢిల్లీ సర్దార్ పటేల్ మార్క్ లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం జోద్ పూర్ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు.

కాగా, అంతకుముందు సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. ఇటీవల కన్నుమూసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫాయాకు వెళ్లిన సీఎం…ఆయన పార్థవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ ను కేసీఆర్ ఓదార్చారు.

అనంతరం అంత్యక్రియలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, తెరాస నేత శ్రావణ్ కుమార్ ములాయం అంత్యక్రియలలో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button