BJP

తెలుగు భాషా దినోత్సవం అక్షరాన్ని బతికిద్దాం అమ్మ భాషను కాపాడు కుందాం

తెలుగు భాషా దినోత్సవం

అనంతపురం : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, భారతీయ జనతా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు సంది రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన అక్షరాన్ని బతికిద్దాం అమ్మ భాషను కాపాడు కుందాం అనే నినాదంతో ఏడు రోజులు దినోత్సవాలు ఏడు నియోజకవర్గాల్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అనంతపురం నగరంలో టవర్ క్లాక్ నుండి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ లో పాల్గొన్న భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పాలేగార్ మంజునాథ్ నాయుడు.


రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషని నామరూపాల్లేకుండా కుట్ర చేస్తున్నాడని, రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తుందని ప్రతి రాష్ట్రంలో మాతృభాష కె ప్రజలు ఇష్టపడతారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యున్నత స్థానంలో ఉన్నారని, వారందరూ తెలుగు భాషతో విద్య నేర్చుకున్న వాళ్లే అని, ముఖ్యమంత్రి గమనించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button