మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం…



శేరిలింగంపల్లి: వినాయక చవితి పర్వదినం ఫ్యామిలీ లో విషాదం నెలకొంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

స్పోర్ట్స్ బైక్ మీద నుంచి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-45 కేబుల్ బ్రిడ్జి మార్గం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా కోహినూర్ హోటల్ వద్ద శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి ధరణతేజ్ కుడి కన్ను పైన, చాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన అపస్మారక స్థితిలో వెళ్ళినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే, ఈ ప్రమాదం షూటింగ్ భాగంగా జరిగిందా
లేదా వేరే కారణంగా జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. సాయికి ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే మెగా కుటుంబ సభ్యులతో తీవ్ర విషాదం లో కి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనా స్థలానికి హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సి సి ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తున్నారు.
చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker