Revanth Reddy:కెసిఆర్ పోటీచేస్తే బరిలో రేవంత్ రెడ్డి



TPCC అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్య రెడ్డి

Hyd: హుజురాబాద్ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తే ఆయన కు పోటీగా టీ పిసిసి అధ్యక్షుడు. ఎంపీ రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి స్పష్టం చేశారు.

గాంధీ భవన్ లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ…. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లపై TRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

రాష్ట్రంలో దళితుల అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్. ఆయన దత్తత గ్రామం వాసాలమర్రి లో సైతం ఇవ్వలేక పోయారని అని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కెసిఆర్ కలవగనే హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయని, దీంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పోస్ట్ కూడా వాయిదా పడిందని ఆరోపించారు. బిజెపి,టిఆర్ఎస్ కలిసిపోయి లోపాయికారిగా పని చేస్తున్నాడు అనడానికి నిదర్శనం అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని కలిసి కెసిఆర్ అక్రమాలపై విచారణ ఆదేశించిన పట్టుబట్టాలని డిమాండ్ చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker