కేసీఆర్ కు ఇక కాలం చెల్లింది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి


జయశంకర్ భూపాలపల్లి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే తొలి స్థానం భూపాలపల్లి అని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నాడు.

భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసిఆర్ సింగరేణిని బొందలగడ్డగా మార్చారని మండిపడ్డారు.1200 మంది అమరుల్తెంది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు. కేసిఆర్ ఇక కాలం చెల్లిందని మండిపడ్డారు.

నక్సలైట్ ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన కెసిఆర్…. వేలకోట్లు దోచుకోమని, ఒకే కుటుంబానికి అన్ని పదవులు అని ఏ నక్సలైట్ ఎజెండాలో ఉందో తెలపాలని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటామని, కార్యకర్తలు కడుపులో పెట్టుకుని కాపాడకుండా మన్నారు.

కాంగ్రెస్ సభలో అపశృతి:
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ అపశృతి చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ చెందిన మాజీ MPTC గోలి సత్యనారాయణ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన TPCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker