నల్గొండ జిల్లాలో షర్మిల భారీ బహిరంగ సభ..
TS:తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలని, రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ.. వస్తున్న ఈమె రేపు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు దళిత బేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.
ఈ సమావేశంలో వైయస్ షర్మిల, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత భేరికి రావాల్సిందిగా MRPS వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ను ఆహ్వానించారు షర్మిల గారు.
రాష్ట్రంలో లో అర్హులైన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, మూడెకరాల భూమికి ఎకరానికి రూ. 10 లక్షల చొప్పున దళిత బందు తో కలిపి 40 లక్షల దళితులకు చెల్లించాలని డిమాండ్ చేయనున్నారు.