CM KCR Delhi Tour: సీఎం కేసీఆర్ తిరిగి రాక



బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు.

నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంలో హోమ్ మినిస్టర్ మహ్మద్ మహమూద్ ఆలీ ఘనంగా స్వాగతం పలికారు. ఈనెల ఒకటో తేదీన ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. రెండవ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్ లో తెలంగాణ భవన్ కు భూమి పూజ చేశారు. ఆ తర్వాత వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ లను సీఎం కేసీఆర్ కలిసి ఇ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రతిపాదనలకు ప్రధాని తో పాటు కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి మోదీని సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం సమీక్షించి చీఫ్ సెక్రెటరీ కి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. వారం రోజుల పాటు పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.

సీఎండికి పరామర్శ..

నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ డి దామోదర్ రావు ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదరరావు తండ్రి నారాయణ రావు కన్ను మూశారు. ఆ సమయంలో ని సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పర్యటన ముగించుకొని గురువారం హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత దామోదరరావు పరామర్శించారు. ఆయన తల్లి ఆండాలమ్మ ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శేరి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శ్రావణ్ రెడ్డి ఉన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker