lang="te"> ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సీపీ సజ్జనార్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సీపీ సజ్జనార్



సైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాదులోని ఆర్ టి సి భవన్ కార్యాలయంలో శుక్రవారం సజ్జనార్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని నెలల క్రితం దిశ కేసులో సత్వర న్యాయం చేశారంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సీపీ సజ్జనార్ గారు కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ ఎండీగా ట్రాన్స్ఫర్ చేసిన సంగతి ఇ అందరికి తెలిసిందే. దాదాపు మూడేళ్లపాటు సైదరాబాద్ సి పి గా పని చేశారు. 2019లో దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో పలు కీలక నిర్ణయాలు సీపీ సజ్జనార్ గారు తీసుకున్నారు. అదేవిధంగా గతంలో సిఐడి, ఇంటెలిజెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.