Telangana CM KCR: ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన అంశాలపై ప్రధాని వద్ద చర్చించారు.
కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్పై చర్చించినట్లు సమాచారం. ఏపీ తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదంపై రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై పలు అంశాలపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించారు.
కాగా, ఈనెల 1న ప్రత్యేక విమానంలో హస్తనకు వెళ్లిన కేసీఆర్.. గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లనూ.. సీఎం కలిసే అవకాశం ఉంది. వీరిద్దరినీ కలిశాకే సీఎం కేసీఆర్ హైదరాబాద్ వస్తారని సమాచారం. వీరి అపాయింట్మెంట్ల కోసం సీఎంవో ఇప్పటికే ఆయా శాఖలను సంప్రదించింది.