Telangana High court: తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..


తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది.

దీంతో ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు సమ్మతించి.. గురుకులాలు తెరవద్దు అంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది.

నిబంధనలు పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరవవచ్చుని న్యాయస్థానం పేర్కొంది. గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్లైన్ బోధన చేపట్టాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే… విద్యాసంస్థల్లో కోవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఏజీ ప్రసాద్ కోర్టుకు వివరించారు.




స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker