షర్మిల కు భారీ షాక్ కీలక నేత రాజీనామా



తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలని షర్మిల గారు. రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు పార్టీ పనుల్లో నిమగ్నమైన షర్మిల మరొక పక్క పార్టీలోని కీలక నేతలు వాట్సాప్ పెట్టి రాజీనామా చేయడం వలన షర్మిలమ్మ కు షాక్ కు గురి చేస్తున్నారు. ఇప్పటికి చేవెల్ల ప్రతాపరెడ్డి, శోభన్ రాజీనామాలు చేయగా, తాజాగా పాలమూరు జిల్లాకు చెందిన ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు.

తమకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం పోవడం వలన రాజీనామా చేయాల్సి వచ్చిందని నేతలు చెప్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ పార్టీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పార్టీ ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లక ముందే పార్టీ కార్యవర్గం రాజీనామా చేయడం వలన ఇతర సభ్యులు కలవరపడుతున్నారు.

చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని రాజీనామా చేయగా, ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంటు కన్వీనర్ మహమ్మద్ ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది చేస్తారో అని పార్టీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు.