Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కి కరోనా,తమ తోటి వారికి విజ్ఞప్తి

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కరోనా నిర్డారణ పరీక్షలలో నాకు పాజిటివ్ గా తేలింది. నా చుట్టూ ఉన్నవారు అలాగే నాకు పరిచయం ఉన్న ఎవరైనా దయచేసి కరోనా పరీక్షలు టెస్టు చేయించుకోండి అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు అమితాబ్.

అమితాబ్ బచ్చన్ కి కరోనా,తమ తోటి వారికి విజ్ఞప్తి

కాగా బిగ్ బీ ప్రస్తుతం బుల్లితెర క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురిని కలుస్తున్నారు. కాగా కరోనా ఆంక్షలు , నిబంధనల నేపథ్యంలో గత రెండేళ్లుగా కేబిసి షూటింగ్ ప్రేక్షకులు లేకుండానే జరిగింది.

అయితే ఈ ఏడాది మాత్రం మళ్లీ పాత పద్ధతిలోని షోను నిర్వహిస్తున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ కు కరోనా ఎలా వచ్చింది అని అధికారంకంగా సమాచారం లేదు.కాగా గత ఏడాది 2021 జూలై 11న కరోనా కారణంగా బారిన పడిన అమితాబ్ బచ్చన్ ముంబైలోని వీలే పార్లే లోని నానావతి ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.

అమితాబ్ తో పాటు అభిషేక్ బచ్చన్,ఐశ్వరరాయ్,ఆరాధ్య కూడా కరోనా కోరలకు చిక్కారు. అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ కూడా కొద్ది రోజులు నానావతి హాస్పిటల్ లో ఉండవలసి వచ్చింది. ఆ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు.మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయి.

అక్కడ గత 24 గంటలలో 25% కరోనా కేసులు పెరుగాయి. ప్రస్తుతం ఆ యొక్క నగరంలో 12,000 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే అమితాబ్ బచ్చన్ గారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కరోనా ఆంక్షలు నిబంధనలు పాటించండి అని ట్విట్టర్లో ఆయన షేర్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker