Singer Chinmayi: ట్రోల్ చేస్తున్న వారికి తగిన సమాధానం

సినిమా రంగంలో అనేకమంది ఉన్నారు. వారిలో కొంతమంది హీరోలు, హీరోయిన్లు, సింగర్స్ చాలా మంది వున్నారు. అలాంటి వారిలో సింగర్ చిన్మయి  ఒకరు. ఈమె   అందరికీ పరిచయం వున్న సింగర్. ఆమె సింగింగ్ తో పాటు, డబ్బింగ్ కూడా చెబుతుంది. సమంతకు చాలా సినిమాల్లో డబ్బింగ్ చెప్పింది. అంతేకాకుండా సోషల్ సర్వీస్ లో కూడా చాలా ముందడుగులో ఉంటుంది. ఆడవారికి ఎలాంటి కష్టం వచ్చినా తాను కచ్చితంగా ముందుంటుంది.

ఆడపిల్లలకు కష్టమని తెలిస్తే వారికోసం పోరాడటానికి ముందుగానే సిద్ధంగా ఉంటుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఆమెను ఫాలో అయ్యే వారికి ఎక్కువగా తెలుసు. ఈమె నటుడు, అలాగే దర్శకుడు రాహుల్ ను ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఈయన అందాల రాక్షసి సినిమాలో రెండో హీరో, అలాగే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు బావ క్యారెక్టర్ లో చేశాడు. ఇదే కాక చాలా సినిమాల్లో కూడా నటించాడు. అంతేకాకుండా చిన్మయి సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే వీరిద్దరికీ ఇప్పుడు పడటం లేదని సోషల్ మీడియాలో పెద్ద టాక్ జరుగుతుంది.

సమంత విడాకుల తర్వాత  వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పెద్ద టాక్ నడుస్తుంది. దీని గురించి మాత్రం ఇద్దరు పెదవి ఇవ్వటం లేదు .ఇది ఇలా ఉంటే సమంత తీసిన శకుంతలం సినిమాను చిన్మయి డబ్బింగ్ చెబితే బాగుంటుందని సినిమా యూనిట్ అన్నారట, అయితే సమంత వద్దు. నేనే డబ్బింగ్ చెబుతాను. చిన్మయి అయితే అసలు వద్దని చెప్పిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొంతసేపు పక్కన పెడితే చిన్మయి, రాహుల్ తాజాగా కవలలకు తల్లిదండ్రులు అయ్యారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఎంతగానో సంతోషించారు.

Singer Chinmayi: ట్రోల్ చేస్తున్న వారికి తగిన సమాధానం
Singer Chinmayi

అయితే వారి సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. ఈ జంట పోస్ట్ పెట్టినప్పటి నుండి అనేక రకాల విమర్శలు తలెత్తుతున్నాయి. కొంతమంది నయనతార లాగానే చిన్మయి కూడా సరోగసి ద్వారా పిల్లలకు తలైందని అంటున్నా వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటన్నిటికీ దీటుగా చిన్న గట్టి సమాధానమే ఇచ్చింది. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇది నేను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన మొదటి ఫోటో అని ట్యాగ్ పెట్టింది. ఈ విషయాన్నితన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాకు తెలియజేసింది.

ఈ ఫోటోతో పాటుగా ఆమె ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఇద్దరు పిల్లలకు ఒకేసారి  పాలు పట్టడం విశేషం. ఈ ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టరు. ఇలా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఈ విధంగా చిన్మయి చేయడానికి ఒక కారణం ఉంది. అదేనండి సరోగసి ద్వారా పిల్లల్ని కనలేదని వీరు ఈమెకే పుట్టిన పిల్లలేనని ఈమె చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందని అన్న వారి నోరు మూయించడానికి ఈ విధంగా ధైర్యంగా పోస్ట్ చేసిందని అర్థమవుతుంది. ఈమె ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు.

సరోగసి, ఐ వి ఏ ఎఫ్, సహజ గర్భం ఇలా ఏ విధంగానైనా పిల్లల్ని కనాలి అనుకోవడం తనకు చాలా పెద్ద విషయం ఏమీ కాదని, అమ్మ అంటే మనుషులకు, జంతువులకు ఒకటే అని. పిల్లలు ఎలా పుట్టినా అమ్మ అమ్మే అవుతుందని. తనకు పిల్లలు సరోగసి ద్వారా పుట్టారని ఎవరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు, ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి, వారి అభిప్రాయాల వల్ల తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాగే వచ్చే ఇబ్బందులు, సమస్యలు కూడా లేవని, సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్ట్ తో తనని ట్రోల్ చేస్తున్న వారికి తగిన సమాధానం ఇచ్చింది.

తన ఇద్దరి బిడ్డలకు పాలిస్తున్న ఫోటోను షేర్ చేసిన తర్వాత ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన ఫీలింగ్ ఏది అంటే పిల్లలకు పాలు ఇవ్వడం అని తన మనసులోని భావాలను బయట పెట్టింది. తాజాగా ఈమె పెట్టిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker