నిజాయితీని చాటుకున్న హోమ్ గార్డ్

అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న HG- 267 వెంకట కృష్ణ నిజాయితీని చాటుకున్నారు. వివరాలలోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం కు చెందిన ఎన్. ఎన్. యస్.వి.శర్మ మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చారు.

స్వామి వారికి మొక్కులు చెల్లించుకునే హడావిడిలో శర్మ తన పర్స్ ను ఆలయ ఆవరణలో గల నాగవల్లీ వృక్షం వద్ద పోగొట్టుకున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన హోమ్ గార్డుకు ఆ పర్సు కనపడింది. మోపిదేవి యస్.ఐ యన్ మురళీ కృష్ణ సమక్షంలో పర్సును బాధితునికి అందించారు. పర్సన్ అందుకున్న ఆ వ్యక్తి పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని, కొనియాడుతూ, హోం గార్డ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ. యస్.ఐ తుంగల ప్రసాద్, సిబ్బంది ముత్యాల దుర్గా రావు లు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker