Viral Video: ఈమెకు భూమి మీద తినే నూకలు ఇంకా మిగిలి ఉన్నట్టున్నాయి

రోడ్డుపై నడిచేటప్పుడు మనం అప్రమత్తంగా మరియు జాగ్రత్త ఉండాలి. నిరంతరం జాగ్రత్త పడుతూనే ఉండాలి. పక్కనున్న వాహనాలను తరచు మనం గమనిస్తూనే ఉండాలి. ఎందుకనగా కొన్ని సందర్భాల్లో అవి మన మీదికి దూసుకొస్తాయి. కొన్నిసార్లు మన తప్పు ఏమీ లేకపోయినా కూడా మన ప్రాణాలు గాల్లోకి కలసిపోతుంటాయి.

ఈమెకు భూమి మీద తినే నూకలు ఇంకా మిగిలి ఉన్నట్టున్నాయి

ఈ నేపథ్యంలో ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం ఒక మహిళ త్రుటిలో తప్పించుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆమె బ్రతికి బయటపడింది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఐఏఎస్ అధికారి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌ లో పంచుకున్నారు.

ఇందులో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై ఆటో డ్రైవర్‌ తన ఆటోను ఎడమవైపు నిలిపి ఉంచుతాడు. అదే సమయంలో ఓ మహిళ అటువైపుగా నడుచుకుంటూ వెళుతుంది. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఆటోను ఢీకొడుతుంది. అయితే ఆ మహిళలకు ఇంకా భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయేమో.

ఆటో ఒకవైపు, కారు మరోవైపు పడిపోవడంతో ఆమె తృటిలో తప్పించుకుంటుంది.ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సాధారణంగా మనం ఎప్పటికప్పుడు వాహనాలను గమనిస్తూనే ఉండాలి. అలా గమనించలేదనుకోండి ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి.

ముఖ్యంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండనీ వాళ్లు ఈ వీడియో చూసిన తర్వాత అయినా జాగ్రత్త ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. రోడ్లపై బాధ్యతయుతంగా ఉండండి అని ఈ వీడియో ద్వారా తెలియపరచడం జరిగింది.అందుకే జాగ్రత్తగా ఉండండి రోడ్లపై వెళ్లేటప్పుడు నడిచేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ఈమెకు భూమి మీద తినే నూకలు ఇంకా మిగిలి ఉన్నట్టున్నాయి

అని ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker