Nithya Menon: టీచర్ గా మారిన నిత్యామీనన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ నిత్యమీనన్. తనదైన శైలిలో నటిస్తూ, తన అందంతో, తన యాక్టింగ్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ తో పాటు సింగింగ్ కూడా చాలా బాగా చేస్తారు నిత్యామీనన్.

నిత్యామీనన్ టీచర్ గా మారింది అంటూ ప్రస్తుతం భారత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి కొద్దిసేపు పాఠాలు కూడా చెప్పారు. ప్రస్తుతం నిత్యామీనన్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది సినిమాలోని షూటింగ్ కోసం మాత్రం జరగలేదు. నిజంగానే స్కూలుకు వెళ్లి ఈ పాఠాలు చెప్పారు నిత్యామీనన్. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అందరిని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంది నిత్యామీనన్. ఆమె రీసెంట్ గా ఓ మలయాళం మూవీలో నటిస్తుంది.

టీచర్ గా మారిన నిత్యామీనన్
టీచర్ గా మారిన నిత్యామీనన్

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ లో భాగంగా ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం అనే గ్రామంలో సందడి చేశారు. తను వచ్చిన సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అక్కడి ప్రాంతానికి కొంచెం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలతో కొద్దిసేపు ఆనందంగా గడిపింది.

పిల్లలకు ఆంగ్లం పాఠాలు కూడా బోధించింది. పిల్లలకర్థమయ్యేలా వాటిని తెలుగులో కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదిక మీదగా తన అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆమె చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది అంటూ మర్చిపోతున్నారు. ఇది పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కృష్ణాపురం అనే గ్రామం ఉంది ఆమె ఏ రాష్ట్రానికి చెందిన కృష్ణాపురం అనే గ్రామానికి వెళ్లి సందడి చేసింది అన్న విషయం తెలియలేదు.

బాల్యంలో చిన్నపిల్లలు చాలా ఆనందంగా జీవిస్తారు. వాళ్లతో గడుపుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నా న్యూ ఇయర్ డే ఇలా గడిచింది అంటూ చెప్పుకొచ్చింది నిత్యమీనన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker