Shashi Tharoor:పాట పాడిన శశిధరూర్, కేంద్ర మాజీ మంత్రి టాలెంట్ కు వీక్షకులు ఫిదా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ సరికొత్తగా ఒక పాట పాడారు. శ్రీనగర్ లో లో జరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఓ సాంగ్ పాడి గాయకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించారు. శ్రీనగర్ doordarshan ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అలనాటి బాలీవుడ్ classic అజ్ నబీ చిత్రం నుంచి ‘‘ఏక్‌ అజ్‌నబీ హసీనా సే’ అనే పాట పాడారు.

ఫోన్ లో లిరిక్స్ చూస్తూ, ఒక సింగర్ లాగా హావభావాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులు అలరించారు. శశిధరూర్ పాట పాడడం మొదలు పెట్టగానే అందరూ తమ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడం ప్రారంభించారు. పాట పూర్తి అయిన అనంతరం ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టి ప్రశంసలు కురిపించారు. తను పాడిన పాటను శశిథరూర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆంగ్ల భాష పరిజ్ఞానం లో దిట్ట గా చెప్పుకునే కేంద్ర మాజీ మంత్రి తనలోని సింగింగ్ టాలెంట్ కూడా బయటపెట్టారు. కాగా ఈ పాటను కిషోర్ కుమార్ పాడగా, రాజేష్ ఖన్నా హీరోగా, జీనత్ అమన్ హీరోయిన్ గా నటించారు. ఏ మాత్రం ప్రాక్టీస్ లేకుండా, హాయిగా పాటను ఎంజాయ్ చేస్తూ ఆడాను అని శశిథరూర్ పోస్ట్ చేశారు. కాగా ఈయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker