ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దివంగత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయులందరికీ ఒక మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆమె కోరారు. భవిష్యత్తును తీర్చిదిద్ది బాధ్యత గల పౌరులుగా విద్యార్థులను తయారు చేసేది గురువు లేనని వారి సేవలను కొనియాడారు. నా రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె తెలిపారు.
పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అలాగే 100% అక్షరాస్యత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచడంతోపాటు నాణ్యమైన విద్యను ఉన్నామని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల ఉంది ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న పురస్కరించుకుని ఆమె రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర విద్యా శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు.