కార్తికేయ 2 మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు.

 బాలీవుడ్ లోనూ అత్యధిక వసూళ్లతో  మంచి లాభాలను తెచ్చి పెట్టింది ఈ సినిమా.

ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్ల  రాబట్టినట్లు తెలుస్తోంది.

 నిఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది.

ఈ సినిమా ఓటిటీ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారిపోయింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జీ ఫైవ్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని ప్రకటించారు.

ఈ సినిమా ఓటీటీ లో జీ ఫైవ్ స్ట్రీమిoగ్ కానున్నట్లు సమాచారం.