10 కోట్ల పాట.

By Siva

శంకర్, రామ్ చరణ్ కలిసి RC15 పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు

హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుంది.

దర్శకుడు శంకర్ RC 15 సినిమాలో పది కోట్ల ఖర్చుతో పాటను చిత్రీకరించబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ ఈనెల 20 నుండి డిసెంబర్ 2 వరకు జరుగుతుంది.

10 కోట్ల ఖర్చుతో తీయబోతున్న పాట రామ్ చరణ్, అద్వానీల డ్యూయెట్ సాంగ్ అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన బాస్కో మార్టిన్ డాన్స్ ను రూపొందిస్తున్నారు.

సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్.

2023 చివర్లో విడుదల  చేయాలనుకుంటున్నట్లుగా సమాచారం.

ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ తరహాలో రూపొందిస్తున్నారు.

సినిమాను ఏ విధంగా రూపొందిస్తున్నారో? 10 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న డ్యూయెట్ సాంగ్ ఎలా ఉంటుందో? పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా నటించబోతున్నాడో? తెలియాలంటే! వేచి చూడక తప్పదు.