SBI: ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పై అంతగా ఉండదు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మాంద్యం ప్రభావం ఎదుర్కొన్న…దీని ప్రభావం భారత్ పై మాత్రం అంతగా ఉండదని SBI చైర్మన్ దినేష్ కారా అన్నారు.

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల సైతం దీని గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం ప్రభావం ఎదుర్కొన్న.. దాని ప్రభావం భారత్ పై మాత్రం అంతగా ఉండదని SBI చైర్మన్ దినేష్ అన్నారు. దేశంలో వృద్ధికి డొకాలేదని, ద్రవ్యల్బణం అదుపులో ఉందని చెప్పారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ ఇచ్చిన ఆయన పిటిఐ వార్త సంస్థ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాంద్యం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ పై మాంద్యం అంతగా ఉండబోదని దినేష్ గారు అన్నారు. బీటా ఫ్యాక్టర్ నే(స్టాక్ హెచ్చుతగ్గుల కొలిచే విలువ) పరిగణలోకి తీసుకుంటే ఎగుమతులు ప్రధానంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్ బీటా ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉందని చెప్పారు.ప్రపంచ ఆర్థికంతో పోలిస్తే భారత్ వృద్ధిరేటు అంచనాలకు మెరుగ్గా ఉంటాయన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయవచ్చు అని చెప్పారు. ప్రపంచ దేశాలను ద్రవ్యోల్బణం వనికిస్తున్నప్పటికీ దేశీయంగా అదుపులోనే ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత ద్రవ్యోల్బణనికి డిమాండ్ కారణం కాదని దినేష్ కారా అన్నారు. సప్లై ఆధారిత ద్రవ్యోల్బణం అని పేర్కొన్నారు. సరఫరా గొలుసులో అంతరాలే ప్రపంచం పై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
ఇప్పటికే సామర్ధ్య వినియోగం 71 శాతం మాత్రం ఉందని చెప్పారు. దీన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.క్రూడాయిల్ ధరలూ మరో కారణమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ రానున్న రోజుల్లో ఆర్థిక మాంద్యం వల్ల కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. భారత వృద్ధి అవకాశాలు మున్ముందు మరింత మెరుగుపడతాయని దినేష్ కారా ధీమా వ్యక్తం చేశారు.