Nayanthara : నాలుగు నెలలకే కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.

నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన శైలిలో నటిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అలాగే దర్శకుడు విగ్నేష్ అందరికీ సుపరిచితుడే. వీరు ఇరువురు ప్రేమించుకొని ఈ సంవత్సరం జూన్ 9వ తేదీన తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని భార్యాభర్తలుగా మారారు.

Nayanatara image

వీరి వివాహం బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. అలాగే వీరి వివాహానికి రజినీకాంత్, మణిరత్నం, షారుక్ ఖాన్, అట్లీ వంటి పెద్ద పెద్ద వారు హాజరయ్యారు. కొంతకాలం తర్వాత సోషల్ మీడియా వేదికగా వీరు పెట్టిన పెళ్లి పెళ్లిఫోటోలు చాలా ఎక్కువగానే వైరల్ అయ్యాయి.

అయితే ప్రస్తుతం నయనతార కవలలకు జన్మనిచ్చింది, పండంటి కావలలకు జన్మనిచ్చిన విషయం తన భర్త విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నయనతార, విగ్నేష్ కు పిల్లలు పుట్టారని, అంతేకాకుండా విగ్నేష్ మీ అందరి ప్రార్థనలు ఫలించాయి, పెద్దల ఆశీర్వాదాలు ఫలించాయి, నేను తండ్రి నన్ను అయ్యాను. అని పిల్లల ఫేస్ కనిపించకుండా తీసిన ఫోటోలను ఎంతో సంతోషంగా అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా వీరిద్దరికీ ఇప్పటికే పెళ్లయి నాలుగు నెలలు మాత్రమే అయింది. నాలుగు నెలలకే ఎలా పిల్లలు పుట్టారు? అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నయనతార ,విగ్నేష్ ల కు జన్మించిన కవలలు ఇద్దరు మగ పిల్లలే. నాలుగు నెలలకే పిల్లలు ఎలా పుట్టారని కొందరు ప్రశ్నిస్తే, మరికొందరు అదుర్స్ సినిమాలో మచ్చ శాస్త్రం చెప్పినట్టుగా నయనతారకు కవలలు పుట్టారని మరికొందరు టోల్స్ చేస్తున్నారు.

అయితే వారు సరోగసి పద్ధతిలో పిల్లల్ని కన్నారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఏదేమైనా నయన్, విగ్నేష్ లకు పిల్లలు పుట్టారు. రీసెంట్ గా నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో పాటుగా మెయిన్ రోల్ లో నటించారు.