ఆయుష్మాన్ భారత్ అమలు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ శాసన మండలి లో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు పై ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు.ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందని… 

ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 87లక్షల మంది లబ్ది చేకూరుతుంది అందుకే ఆరోగ్య శ్రీ పథకం ని అమలు చేస్తున్న అన్నారు. గత మే 18/2021 నెల ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రం లో అమలు చేస్తున్నాం.మే18వ తేదిన నుంచి 1,18,247 మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స  అందించామని ప్రకటన చేశారు.

 ఆరోగ్య శ్రీ,ఆయుష్మాన్ భారత్ రెండు రాష్ట్రాంలో అమలు చేస్తున్నామని, కరోనా,బ్లాక్ ఫంగస్ కు కార్పొరేట్ హాస్పిటల్ లకు దీటుగా ప్రభుత్వం హాస్పిటల్ లో వైద్యం అందిచామని హరీష్ రావు తెలిపారు.వేరే రాష్ట్రల వారికి మనం ఆరోగ్య శ్రీ డబ్బులు చెల్లించబోమని,GST బకాయిలు కేంద్రం నుండి సకాలంలో ఇవ్వడం లేదని మండిపడ్దారు.

కరోనా కారణంగా GST బకాయిలు దఫా దఫాలుగా 2022 వరకూ ఇస్తామని, కేంద్రం తెలిపింది అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 15 15 ఆర్ధిక సంఘం సూచించింది కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని… ప్యాకేజ్ పై నిర్మల సీతారామన్ ను అడిగితే ఇప్పటి వరకు నిర్మల సీతారామన్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలో కూడా ఉద్యోగులకు 30 శాతం PRC పెంచామన్నారు హరీష్‌ రావు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker