జిల్లాలో పారదర్శకంగా ముగిసిన మహిళా పోలీసుల ఆన్లైన్ పరీక్షలు
జిల్లాలో పారదర్శకంగా ముగిసిన మహిళా పోలీసుల ఆన్లైన్ పరీక్షలు
- గత రెండ్రోజులుగా నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలకు 1085 మంది హాజరు
- ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సహకరించిన కళాశాలల యజమాన్యాలకు కృతజ్ఞతలు
— జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
మహిళా పోలీసులకు ప్రొబేషన్ డిక్లరేషన్ లో భాగంగా గత రెండ్రోజులుగా జిల్లాలో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో పారదర్శకంగా ముగిసేలా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో పని చేస్తున్ మమహిళా పోలీసులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసేందుకు నిన్న, ఈరోజు ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుత్తి, పుట్టపర్తి పట్టణాల్లోని ఆయా కళాశాలల్లో స్లాట్ ల వారీగా మహిళా పోలీసులకు ఆన్లైన్ పరీక్షలు కొనసాగించారు. నిన్న, ఈరోజు కలిపి 1085 మంది ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇదిలావుండగా... మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేసేందుకు అవసరమైన ప్రాజెక్టు వర్కును గత వారంలో ఐదు రోజులు నిర్వహించారు. మహిళలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించడం, డౌన్లోడ్ చేయించడం... మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం, వల్నరబుల్ ప్రాంతాలను మ్యాపింగు చేయడం, ఉమెన్ ఫ్రెండ్లీ టీంలను ఏర్పాటు చేయడం, సమాచార సేకరణ, యువతపై సోషల్ మీడియా ప్రభావం, శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించే విధానం, సాంఘిక దురాచారాలను ప్రారదోలుటకు చేయాల్సిన కార్యక్రమాల పట్ల అవగాహన చేశారు. ఈ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడంలో సహకరించిన కళాశాలల యజమాన్యాలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.