University Grants Commission:బంపర్ ఆఫర్ ప్రకటించిన UGC

University Grants Commission: విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC). 23 వేలకు పైగా ఉన్నత విద్యకు సంబంధించి కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త వెబ్ పోర్టల్ను లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీతోపాటు మరెన్నో డిమాండ్ ఉన్న కోర్సులు,పూర్తిగా ఉచితంగా అందిస్తున్న కోర్సులతో పాటు అందించడం జరుగుతుంది.



రిమోట్ విధంలో ఉన్న విద్యను దేశంలో నలుమూలలా ఉన్న విద్యార్థులకు ఈ విద్యను అందించే విధానాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పోర్టల్ ను లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 తీసుకొచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేపథ్యంలో జూలై 28 నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ పోర్టల్ ను తీసుకొచ్చింది.

ఈ విషయం పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎమ్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులందరికీ మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పోర్టల్ ని తీసుకొచ్చాము. ఈ పోర్టల్ అన్ని స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారికి కూడా డిజిటల్ నైపుణ్యాలు పెరుగుతాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎమ్ జగదీష్ కుమార్ చెప్పుకొచ్చాడు.

23 వేలకు పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఈ పోర్టల్ లో అందిస్తుండగా ఇందులో 137 SWAYAM MOOC కోర్సులతోపాటు 25 నాన్ ఇంజనీరింగ్ కోర్సులను ఈ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులన్నీ ఉచితంగా అందిస్తున్నప్పటికీ సి ఎస్ సి/ఎస్ పి వీ సేవలను పొందడానికి మాత్రం రోజుకు 20 రూపాయలు లేదా నెలకు 500 రూపాయలు యూజర్లు చెల్లించాల్సి ఉంటుంది.