ఇడుపులపాయకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్

వేంపల్లి: తన మామ, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారు ఇచ్చిన వినతులు స్వీకరించారు. సాయంత్రం 5.28 గంటలకు ఇడుపులపాయలోని అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు.

ఆదివారం ఉదయం పులివెందులలో జరిగే డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు, రమేష్ యాదవ్, వెన్నపూస గోపాల్ రెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి,బిజేంద్రనాథరెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నేత వైయస్ మనోహర్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు స్థానిక నేతలు ఉన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker