ఏపీలో కొనసాగుతున్న జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్…

AP:ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీ ఎంపిటిసి,జెడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మరికొన్ని గంటల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. 13 జిల్లాలో ఓట్లు లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ కోసం 11,803 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 32,264 సిబ్బందిని నియమించారు.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో..375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్థానాల్లో నోటిఫికేషన్ విడుదల కాదా…2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యారు. ఇందులో అభ్యర్థులు మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 7220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు వారి భవిత్వం తేలనుంది. సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫలితాల తర్వాత సంబరాలు, విజయోత్సవ ర్యాలీలో అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మద్యం షాపులను మూసివేసి, 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చారు. కౌంటింగ్ సిబ్బందితోపాటు అభ్యర్థుల తరపున హాజరైన ఏజెంట్లు కరోనా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. అభ్యర్థి,కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోస్లు వ్యాక్సిన్ పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం చూపాలి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker