పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాం: మంత్రి ఆదిమూలపు సురేష్

తెలుగు భాషఅభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Guntur: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ గుర్రం జాషువా జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నగరం పాలెం సెంటర్ లోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుతూనే.. తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేశామని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలని, గత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు పరం చేసి బడుగులకు విద్యను దూరం చేశాయని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.

ప్రైవేట్ వర్సిటీలో 35 శాతం సీట్లు రాష్ట్ర సర్కారు నిర్ణయించిన ఫీజులు బడుగు, బలహీన వర్గాల కేటాయించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఆదిమూలపు సురేష్ వివరించారు. క్యాబినెట్ విస్తరణ విషయంలో తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.