11 జిల్లాలోని 41 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో నకిలీ చలానాలు: మంత్రి ధర్మాన



అమరావతి: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలానాలు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

నకిలీ చలానాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.9.26 కోట్ల నష్టం వాటిల్లింది అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకే రూ.5.08 కోట్లు రికవర్ చేశామని… మరో రూ.4.18 కోట్లు రావాల్సి ఉందన్నారు. దర్యాప్తులో భాగంగా 11 జిల్లాల్లో 41 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నకిలీ చలానాల గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు కొందరి పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పై 44 కేసులు, 29 మందికి శాఖాపరమైన చర్యలు తొమ్మిది మంది సబ్ రిజిస్టర్ లను విధుల నుంచి తప్పించి నట్లు చెప్పారు. నకిలీ చలానాల బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తయిన వెంటనే తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నకిలీ చలానాల ఈ వ్యవహారంలో విచారణకు అడిషనల్ ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి అదే ఏడాది ఇది జులై 31 వరకు లావాదేవీలపై విచారణ జరిపారు. 2020 ఏప్రిల్ 1 నుంచి మార్చి 2021 వరకు జరిగిన లావాదేవీల పైన దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.