విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి



AP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు..

రామచంద్రపురం పురపాలక పరిధిలోని చాకలిపేట మున్సిపల్ హై స్కూల్ ను మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులు పరిశీలించారు.
విద్య కనుక కిట్ల పంపిణీ పై మంత్రి ఆరా తీశారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తెలుసుకునేందుకు, స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు ఓడించి వారితో కలిసి మంత్రి భోజనం చేశారు. నాణ్యమైన ఆహారం అందిస్తున్న సిబ్బందిని అభినందించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రోడ్ల దుస్థితి నాటి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చిన రోడ్ల నిర్మాణాలు 3 ఏళ్ళు తిరగకుండా ధ్వంసమయ్యాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, మున్సిపల్ చైర్ పర్సన్ గంధం టీ,శ్రీదేవి, వైస్ చైర్మన్ లు కొలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరావు, మున్సిపల్ కౌన్సిల్ సాయి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు గుబ్బల గుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గంధం శెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker