ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో వెబినార్ ద్వారా పాల్గొననున్న ఉపరాష్ట్రపతి

అనంతపురము, ఆగస్టు 25: రేపు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో వెబినార్ ద్వారా పాల్గొననున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెబినార్ ద్వారా పాల్గొననున్నారని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ఏ కోరి  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపటి రోజు జె ఎన్ టి యు ఉపకులపతి కార్యాలయం లో సమీపంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందుఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలలో ఉపరాష్ట్రపతి వ్యవస్థాపక దినోత్సవ సందేశం ఇవ్వనున్నారు.

విశిష్ట అతిథులుగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఆఫ్ స్టేట్ డా. సుభాష్ సర్కార్, విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్, అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఐఏఎస్ గారు, ఎస్పీ డా. కె. ఫకీరప్ప గారు,జిల్లా అధికారులు పాల్గొంటారు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker