CricketSports News

Ind VS Ban 2nd Test: భారత్ క్రికెట్ టీం లో మార్పు

సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రెండో టెస్టుకు దిగిన తుది భారత జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు దూరమయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన చైనామన్ స్పిన్నర్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు.

భారత్ క్రికెట్ టీం లో మార్పు
భారత్ క్రికెట్ టీం లో మార్పు


మహ్మద్ సిరాజ్ మరియు ఉమేష్ యాదవ్‌లతో పాటు, ఈ లెఫ్టార్మ్ పేసర్ కూడా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భాగమయ్యాడు. మరోవైపు తొలి టెస్టులో రాణించిన స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ జోరు కొనసాగింది. దీంతో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత జయదేవ్ టెస్టు జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచింది


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. మోమినుల్ స్థానంలో మోమినుల్, ఇబాదత్ హొస్సేన్ స్థానంలో తస్కిన్ అహ్మద్‌లు వచ్చారు.


అందుకే కుల్దీప్ ఔట్: రాహుల్
టాస్‌ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. కుల్‌దీప్‌ యాదవ్‌ను తప్పించడం దురదృష్టకర నిర్ణయమని, అయితే జయదేవ్‌కు అవకాశం ఇవ్వాలంటే అలా చేయాల్సి వచ్చిందని అన్నాడు. టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటామని చెప్పాడు.

బంగ్లాదేశ్‌ VS భారత్‌ రెండో టెస్టు- తుది జట్లు ఇవే
భారత్‌: కేఎల్ రాహుల్(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కట్‌, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్‌: నజ్ముల్ హొస్సేన్ శాంటో, జాకీర్ హసన్, మోమినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), నూరుల్ హసన్(వికెట్‌ కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, టస్కిన్ అహ్మద్.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button