Rakul Preet Singh ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే
డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టెస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. నిన్న పూరి జగన్నాథ్ ను విచారించిన ఈడి నేడు సినీ నటి ఛార్మి కౌర్ ని విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో ఉన్న మరో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఎదుట హాజరు కావాల్సి ఈనెల 6వ తేదీన హాజరుకావాలని ఈడీ నోటీసులు పంపింది. అయితే కొన్ని కారణాల వల్ల విచారణకు హాజరు కాలేక పోతున్నానని అని ఈడికి లేఖ రాసింది. తేదీని మార్చి మరో తేదీ ఇవ్వవలసిందిగా అధికారులను కోరింది.
అయితే రకుల్ ప్రీతిసింగ్ రిక్వెస్ట్ ని అధికారులు ఈనెల 6వ తేదీ లో ఎట్టి పరిస్థితులలో హాజరు కావాల్సిందేనని అధికారులు మరో తేదీ ప్రకటించడం కుదరదని ముందుగా నిర్ణయించిన సమయానికి రావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు రిప్లై ఇచ్చారు.