ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…



త్వరలో APSRTC ఉద్యోగులకు పదోన్నతులు

Amaravati: ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించబోతుంది. త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెయ్యి మందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిల్లో ఎక్కువ పదోన్నతులు దక్కనున్నాయి.

మెకానిక్, జూనియర్ అసిస్టెంట్లు,సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్, కంట్రోలర్లు, గ్యారేజ్ సూపర్వైజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియ ను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది.

ప్రతి ఒక్కరికి ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించేందుకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేసింది.