సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలర్ట్..


గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలర్ట్ డిపార్ట్మెంట్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ APPSC విడుదల చేసింది. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC నోటిఫికేషన్ పేర్కొంది.

ఈ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు APPSC వెబ్ సైట్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. వారు ఓటిపి లో వచ్చే యూజర్ ఐడి తో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 13వ తేదీ నుంచి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా ఈ పరీక్షల మొత్తం వంద మార్కులు నిర్వహిస్తుండగా, అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబేషనరీకి అర్హత సాధిస్తారు అని APPSC తెలిపింది. అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15004 గ్రామ వార్డు సచివాలయం లో పనిచేస్తున్న సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహిస్తుంది.